కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం: ఎంపీ లక్ష్మణ్‌

BJP MP Laxman said that we welcome KCR's national party. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కొత్త జాతీయ రాజకీయ పార్టీని ప్రారంభించడాన్ని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు,

By అంజి  Published on  30 Sep 2022 11:46 AM GMT
కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం: ఎంపీ లక్ష్మణ్‌

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కొత్త జాతీయ రాజకీయ పార్టీని ప్రారంభించడాన్ని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం స్వాగతించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం అని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారని అన్నారు.

జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు గురించి ఆలోచించడం లేదని ఒక ప్రశ్నకు ఆయన స్పష్టం చేశారు. ''బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడి పదవి కేంద్ర మంత్రి పదవితో సమానమని నేను భావిస్తున్నాను'' అని ఆయన అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తర్వాత మాత్రమే తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు.

కాంగ్రెస్‌.. దేశంలో ఎక్కడా లేదని కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారని చెప్పారు. టైమ్‌, అవసరాల నేపథ్యంలో కొందరు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారని కామెంట్ చేశారు. ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ అనేది పార్టీ నిర్ణయమని, తన సొంత నిర్ణయాలు ఉండవు పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని లక్ష్మణ్‌ అన్నారు.

Next Story