న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్ష సభ్యులు భారీగా నినాదాలు చేయడంతో బుధవారం లోక్సభ వాయిదా పడింది.
సస్పెండ్ చేయబడిన ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన తెలుపుతూ, "ప్రధాని రాజీ పడ్డారు" అని రాసి ఉన్న పోస్టర్లను పట్టుకుని కనిపించారు. నిబంధనలను ఉల్లంఘించి, చైర్పై కాగితాలను విసిరేసినందుకు ఎనిమిది మంది ఎంపీలను బడ్జెట్ సమావేశాల మిగిలిన సమయం వరకు సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.
కాగా క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా మంగళవారం లోక్సభ నుండి మిగిలిన బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేయబడిన కాంగ్రెస్ ఎంపీలు గుర్జీత్ సింగ్ అజ్లా, హిబి ఈడెన్, బి. మాణికం ఠాగూర్, సీపీఐ(ఎం) ఎంపీ ఎస్ వెంకటేశన్ మరియు ఇతర ఎంపీలు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో "ప్రధాని రాజీ పడ్డారు" అనే పోస్టర్తో నిరసన తెలిపారు.