శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న కూంబింగ్ను వెంటనే నిలిపివేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దులొ కొనసాగుతున్న సైనిక ఆరేషన్ వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగట్ట, నాడ్పల్లి, పూజారి కాంకేర్ అటవీ ప్రాంతాల్లోని 'మావోయిస్టు బెటాలియన్ నెం.1' స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ స్థావరంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలు, కీలక కమాండర్లు ఉన్నట్టు భద్రత బలగాలు భావిస్తున్నాయి. దాదాపు 20 వేల మంది సుశిక్షితులైన కమాండోలు ఈ స్థావరం దిశగా దూసుకుపోతున్నారు. మావోయిస్టులను ఏరిపారేసే కార్యాచరణలో చరిత్రలోనే ఇది అతి పెద్ద ఆపరేషన్ అని కేంద్రం చెబుతోంది.
ఈ ఆపరేషన్లో ఇప్పటికే నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎండ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ కగార్ ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 30 నుంచి 40 మంది జవాన్లు డిహైడ్రేట్ అయి స్థానిక ఆస్పత్రులకు తరలించారు.