తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By - Knakam Karthik |
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన. నాడు ఎన్నికలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్ల మీద జెలటిన్ స్టిక్స్తో బాంబులు వేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు "ఇది మానవ నిర్మిత విధ్వంసం" అని మొత్తుకుంటున్నా, ఈ 'చిట్టి నాయుడి' ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు.
ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా? భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్ డ్యామ్లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారు. మీ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా? ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ గారి రిపోర్ట్ చెంపపెట్టు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి రేవంత్ రెడ్డి? అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టండి. రాజేంద్ర సింగ్ గారు డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. లేదంటే ఈ బాంబుల సెగ మీ కుర్చీ దాకా రావడం ఖాయం..అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. "పక్కా మాఫియా పాలన"నాడు ఎన్నికలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు.. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్ల మీద జెలటిన్ స్టిక్స్తో బాంబులు వేస్తున్నారుప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు "ఇది మానవ… pic.twitter.com/GAdLYJSg5Z
— KTR (@KTRBRS) December 23, 2025