ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య

RSS worker was killed in Palakkad. సోమవారం ఉదయం పాలక్కాడ్ జిల్లా ఎల్లపుల్లిలో 26 ఏళ్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తను

By Medi Samrat  Published on  15 Nov 2021 11:13 AM GMT
ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య

సోమవారం ఉదయం పాలక్కాడ్ జిల్లా ఎల్లపుల్లిలో 26 ఏళ్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తను SDPI (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) సభ్యుల బృందం హత్య చేసింది. మృతుడు ఎస్ సంజిత్ (27)గా గుర్తించబడ్డాడు. అతను తన భార్యతో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ముఠా దాడి చేసి, హత్య చేసింది. ఉదయం 9 గంటల సమయంలో యువకుడు తన భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, నలుగురు వ్యక్తులు అతనిని అనుసరించి దాడి చేశారు.

ఇది పక్కా ప్రణాళికతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) చేసిన రాజకీయ హత్యగా పాలక్కాడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరిదాస్ అభివర్ణించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎస్‌డిపిఐకి మద్దతిచ్చిందన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, గాయపడిన సంజిత్ మృతి చెందాడు. భద్రతను పెంచారు మరియు ప్రాంతాన్ని చుట్టుముట్టారు.


Next Story