మ‌రో సంచ‌ల‌న స‌ర్వే : ఈ సారి కూడా మోదీకే ప‌ట్టం క‌డుతామంటున్న జ‌నం..!

Rahul Gandhi's Popularity Grows But PM Modi Remains Dominant. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం లోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు.

By Medi Samrat
Published on : 24 May 2023 12:45 PM IST

మ‌రో సంచ‌ల‌న స‌ర్వే : ఈ సారి కూడా మోదీకే ప‌ట్టం క‌డుతామంటున్న జ‌నం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం లోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ఈ విషయం పలు సర్వేలు స్పష్టం చేశాయి. "పబ్లిక్ ఒపీనియన్", లోక్నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) భాగస్వామ్యంతో "పబ్లిక్ ఒపీనియన్"ను నివేదిక విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో సహా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రజల మూడ్‌ను అంచనా వేయాలని సర్వే భావించింది. మే 10- 19 మధ్య 19 రాష్ట్రాలలో సర్వేను నిర్వహించారు.

కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినప్పటికీ ప్రధాని మోదీకి ప్రజాదరణ బాగా ఉంది. దాదాపు 43% మంది బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) వరుసగా మూడోసారి గెలుపొందాలని అభిప్రాయపడ్డారు. 38% మంది విభేదిస్తున్నారు. ఈరోజు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని దాదాపు 40% మంది చెప్పారు. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ సరైనవాడని 43 శాతం మంది చెప్పారు. ఆయన సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీ 27 శాతం మంది మద్దతు తెలిపారు. 2019, 2023కి సంబంధించిన ప్రధానమంత్రి మోదీకి (44 నుంచి 43%) స్వల్ప తగ్గుదలని కనిపించగా.. రాహుల్ గాంధీకి (24 నుంచి 27%) పెరుగుదల కనిపించింది.


Next Story