దేశంలో పెరుగుతున్న‌ కరోనా కేసులు.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం

PM Modi to hold high-level review meeting on Covid situation. దేశంలో మ‌ర‌లా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా యాక్టివ్‌గా మారింది

By Medi Samrat
Published on : 22 March 2023 3:37 PM IST

దేశంలో పెరుగుతున్న‌ కరోనా కేసులు.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం

PM Modi to hold high-level review meeting on Covid situation

దేశంలో మ‌ర‌లా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా యాక్టివ్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్ర‌స్తుత‌ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రధాని మోదీ పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కరోనాకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్‌కు సంబంధించిన పరిస్థితి, మ‌హ‌మ్మారిని ఎదుర్కోవడానికి సన్నాహాలను ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

గ‌డిచిన‌ 24 గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,026కి చేరింది. అలాగే కరోనా కారణంగా గ‌త 24 గంట‌ల్లో ఐదుగురు మరణించారు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటివరకు.. భారతదేశంలో 220.64 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. 102.73 కోట్ల మందికి పైగా మొదటి డోస్‌ని పొందారు. 5.19 కోట్లకు పైగా రెండవ డోసులు ఇవ్వబడ్డాయి. దీనితో పాటు.. 22.71 కోట్ల మందికి పైగా ప్రజలకు ముందు జాగ్రత్త మోతాదు కూడా ఇవ్వబడింది.


Next Story