పాకిస్తాన్పై చర్యలకు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా.. ప్రధాని మోదీని NSA అజిత్ దోవల్ కలిశారు. ఈ సమావేశం ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్య తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉంది. ఈ దాడి జరిగినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో ప్రధానమంత్రి అజిత్ దోవల్ను కలవడం ఇది రెండోసారి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే మాక్ డ్రిల్స్ కు ఒక రోజు ముందు ఈ సమావేశం జరుగనుండటం విశేషం.
National Security Advisor Ajit Doval meets PM @narendramodi at his residence#PahalgamTerrorAttack pic.twitter.com/r6NdqmLFFN
— DD News (@DDNewslive) May 6, 2025
గత కొన్ని రోజులుగా నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరియు ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ అధిపతులతో అనేక ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇది ఎల్ఇటి ఉగ్రవాద సంస్థపై సైనిక చర్యపై చర్చలకు ఆజ్యం పోసింది. గత వారం, ప్రధానమంత్రి మోదీ.. దోవల్, జనరల్ చౌహాన్లను కలిసి, భారతదేశ సైనిక ప్రతిస్పందన యొక్క "విధి, ఉద్దేశ్యం.. సమయాన్ని నిర్ణయించడానికి సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ" ఇచ్చారు.
సమర్థవంతమైన పౌర రక్షణ కోసం మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లు నిర్వహించబడుతున్నాయి. ఈ విషయంలో, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. చివరిసారిగా ఇటువంటి డ్రిల్ 1971లో జరిగింది, ఆ సంవత్సరం భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.
#WATCH दिल्ली: देशभर में 7 मई को प्रभावी नागरिक सुरक्षा के लिए मॉक ड्रिल के आयोजन के संबंध में केंद्रीय गृह सचिव गोविंद मोहन द्वारा बुलाई गई बैठक संपन्न हुई। pic.twitter.com/SU1K0xZNcs
— ANI_HindiNews (@AHindinews) May 6, 2025
ఏప్రిల్ 22న పహల్గామ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది పర్యాటకులు. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద సంఘటన ఇది. 2019లో 40 మంది సైనికులు మరణించారు.