జైపూర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే.!

Earthquake Of 3.8-Magnitude Strikes Jaipur. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌ వాయువ్య ప్రాంతంలో శుక్రవారం ఉదయం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని

By అంజి  Published on  18 Feb 2022 5:34 AM GMT
జైపూర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే.!

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌ వాయువ్య ప్రాంతంలో శుక్రవారం ఉదయం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ రోజు (ఫిబ్రవరి 18) ఉదయం 8 గంటలకు భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని ఎన్‌సీఎస్‌ తన తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే భూకంప ధాటికి జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. జైపూర్‌ కేంద్రానికి 92 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సికార్, ఫతేపూర్ సహా కొన్ని జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి.

ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో నిన్న, మొన్న భూమిలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. కత్రాలో గురువారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు పహల్గామ్‌లో బుధవారం ఉదయం 5.43 గంటలకు భూ ప్రకంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.2గా న‌మోదు అయ్యింద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని పహల్గామ్‌కు 15 కిలోమీట‌ర్ల దూరంలో గుర్తించారు. కాగా.. ఈ భూకంపం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

Next Story