చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్పింగ్తో భేటీ ఎప్పుడంటే..?
ట్రంప్ టారిఫ్ వార్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
By Medi Samrat
ట్రంప్ టారిఫ్ వార్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది. ఆదివారం టియాంజిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
జపాన్లో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని.. SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రెసిడెంట్ Xi ఆహ్వానం మేరకు PM మోదీ చైనాలో పర్యటిస్తారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ట్రంప్ టారిఫ్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆగస్టు 31న ఎస్సిఓ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. గత ఏడేళ్లలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. జూన్ 2020లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి)లో రెండు దేశాల సైనికుల మధ్య గాల్వాన్ వ్యాలీ ప్రతిష్టంభన తర్వాత ఇదే ప్రధాని తొలి పర్యటన.
2024లో రష్యాలోని కజాన్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనను ముగించేందుకు దాదాపు 3500 కి.మీల LACలో గస్తీకి భారత్, చైనా అంగీకరించిన తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో పురోగతి సాధ్యమైంది.
SCO సమ్మిట్ కోసం టియాంజిన్లో ప్రధాని మోదీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు, అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ఆగస్టు 21న భారత్లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడం చాలా ముఖ్యం, మా వైపు నుండి మేము దీనికి చాలా ప్రాముఖ్యతనిస్తామని పేర్కొన్నారు.
గత ఏడాది కజాన్లో అధ్యక్షుడు జితో భేటీ అయినప్పటి నుండి ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన, సానుకూల పురోగతిని ప్రధాని స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అంతకుముందు.. SCO శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినందుకు ప్రెసిడెంట్ జీకి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.. తన అంగీకారాన్ని తెలిపారు. SCO సమ్మిట్కు చైనా అధ్యక్షత వహించడానికి ఆయన మద్దతు తెలిపారు. టియాంజిన్లో ప్రెసిడెంట్ జిని కలిసే విషయమై తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.