13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం.. అనారోగ్యానికి గురైందని చూడకుండా..

Forced whoredom with a 13-year-old girl. బాలికకు తండ్రి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ.. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది.

By అంజి  Published on  18 Dec 2021 3:00 AM GMT
13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం.. అనారోగ్యానికి గురైందని చూడకుండా..

గుంటూరు జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అనారోగ్యానికి గురికావడంతో.. ఆమెను నిర్వహకులు వదిలేశారు. దీంతో బాలిక తండ్రి చెంతకు చేరింది. జరిగిన విషయాన్ని చెప్పడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడులో భార్య, 13 ఏళ్ల కూతురికి 7 నెలల కిందట కరోనా సోకింది. వారిని బాలిక తండ్రి జీజీహెచ్‌లో చేర్చించగా.. భార్య చికిత్స పొందుతూ చనిపోయింది. అదే సమయంలో బాలికకు తండ్రి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ.. తాను ఓ నర్సునని బాలిక తండ్రిని నమ్మించింది.

బాలికకు నాటు వైద్యం చేస్తే.. కరనా తగ్గిపోతుందని నమ్మించి.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడికి గురి చేసింది. ఇష్టం లేదని చెప్పినా.. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉంచుకుని ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. నెల్లూరు, విజయవాడ, ఒంగోలుకు తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది. కాగా కొన్ని రోజుల కింద బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను నిర్వహకురాలు విజయవాడలో వదిలేసిందని, ఆ తర్వాత బాలిక తన ఇంటికి చేరిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాలిక తండ్రి గుంటూరులోని ఓ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌ పని చేస్తున్నాడు.

రెండు నెలల కిందట బాలిక మిస్సింగ్‌ అయినట్లు నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత బాలిక నెల్లూరు ఉన్నట్లు తెలియడంతో నల్లపాడు పోలీసులు కేసును మూసేశారు. అయితే రెండు నెలల కిందట బాలిక నెల్లూరు ఉందని తెలిసినా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. దీనికి వెనుక ఉన్న రహాస్యాలు ఏంటి? బాలికను తండ్రే అప్పగించారా? బాలిక ఎవరి చెరలో ఉంది ఈ రెండు నెలలు అనేది ప్రశ్నర్థకంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story