తెలంగాణలో కొత్తగా 1,102 కేసులు.. 9 మరణాలు
By న్యూస్మీటర్ తెలుగు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగస్టు 15న శనివారం) 12,120 శాంపిల్స్ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 91,361కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 693 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,930మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68,126కి చేరింది. 22,542 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 14
భద్రాద్రి కొత్తగూడెం- 15
జీహెచ్ఎంసీ -234
జగిత్యాల-11
జనగాం-16
జయశంకర్ భూపాలపల్లి – 0
జోగులాంబ గద్వాల – 17
కామారెడ్డి -33
కరీంనగర్ -101
ఖమ్మం -46
ఆసిఫాబాద్ – 03
మహబూబ్ నగర్ -37
మహబూబాబాద్ -21
మంచిర్యాల- 09
మెదక్ – 18
మేడ్చల్ మల్కాజ్గిరి – 63
ములుగు –08
నాగర్కర్నూల్ – 29
నల్లగొండ – 28
నారాయణపేట -04
నిర్మల్ -04
నిజామాబాద్ – 33
పెద్దపల్లి – 22
రాజన్న సిరిసిల్ల -13
రంగారెడ్డి -81
సంగారెడ్డి -66
సిద్దిపేట – 30
సూర్యాపేట-13
వికారాబాద్-08
వనపర్తి –19
వరంగల్ రూరల్ –25
వరంగల్ అర్భన్ -70
యాదాద్రి భువనగిరి -11 కేసులు నమోదు అయ్యాయి.