తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ అల‌ర్ట్‌

రాబోయే 3 రోజుల పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది

By Medi Samrat
Published on : 9 May 2025 8:13 AM IST

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ అల‌ర్ట్‌

రాబోయే 3 రోజుల పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనుండ‌టంతో వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించ‌నుంది.

మే 9, శుక్రవారం తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, హైదరాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనపేట, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ.) కురిసే అవకాశం ఉంది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో శనివారం మే 10న కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుంది.

ఆదివారం మే 11న‌ ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు, ఈదురు గాలులు రాష్ట్రవ్యాప్తంగా సంభవించే అవకాశం ఉంది. వాతావరణ సూచన మే 12 ఉదయం 8:30 వరకు కొనసాగుతుందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

IMD అధికారుల ప్రకారం.. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత మరోసారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరగవచ్చు.

Next Story