వర్షాలు పడబోతున్నాయి.. వాతావరణ విభాగం హెచ్చరికలు

IMD Predicts Moderate Intensity Rain. నైరుతి రుతుపవనాలు ముంబైతో సహా కొంకణ్‌లోని చాలా ప్రాంతాలలో పురోగమించాయని

By Medi Samrat  Published on  11 Jun 2022 11:25 AM GMT
వర్షాలు పడబోతున్నాయి.. వాతావరణ విభాగం హెచ్చరికలు

నైరుతి రుతుపవనాలు ముంబైతో సహా కొంకణ్‌లోని చాలా ప్రాంతాలలో పురోగమించాయని భారత వాతావరణ విభాగం (IMD) శనివారం తెలిపింది. నగరంలోనూ దాని పరిసర ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. "వచ్చే 3-4 గంటల్లో థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ మరియు ముంబై జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో 30-40 కి.మీ వేగంతో గాలులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి తీవ్రమైన వర్షం కురిసే అవకాశం ఉంది." IMD ముంబై తెలిపింది.

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని ముంబయితో సహా చాలా ప్రాంతాల మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటక లోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి , గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం లోని కొన్ని భాగాల లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయని తెలిపింది.

ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టంనకు 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ఉత్తర కోస్తా, యానాంలలో ఈ రోజు ,రేపు , ఎల్లుండి (జూన్ 13వ తేదీ) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ , వేగం తో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు ,రేపు, ఎల్లుండి (జూన్ 13వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.








Next Story