జూన్ 11, 12 తేదీల్లో ఉరుములు, మెరుపులు కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంతే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలకు జూన్ 14, 2025 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో కూడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ జారీ చేసిన ఎల్లో అలర్ట్ హైదరాబాద్కు జూన్ 13 వరకు వర్తిస్తుంది.
మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అస్సాంలోని పలు జిల్లాలకు IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద లేదా బలహీనమైన నిర్మాణాల దగ్గర ఆశ్రయం పొందవద్దని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాల వల్ల నీటి ఎద్దడి లేదా ప్రమాదకరమైన డ్రైవింగ్ పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి.. ప్రయాణికులు బయటికి వెళ్లే ముందు రోడ్డు,ట్రాఫిక్ పరిస్థితులను తనిఖీ చేయాలని కూడా సూచించారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్తో సహా వివిధ జిల్లాలకు IMD జారీ చేసిన వర్ష సూచనల దృష్ట్యా, నివాసితులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.