Telangana : 48 గంటలపాటు వ‌ణికించ‌నున్న‌ చలిగాలులు.. ఐఎండీ హెచ్చరిక

రానున్న రెండు రోజులు తెలంగాణలో వాతావ‌ర‌ణం అత్యంత చలిగా ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 19 Dec 2025 6:38 PM IST

Telangana : 48 గంటలపాటు వ‌ణికించ‌నున్న‌ చలిగాలులు.. ఐఎండీ హెచ్చరిక

రానున్న రెండు రోజులు తెలంగాణలో వాతావ‌ర‌ణం అత్యంత చలిగా ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 19, 20 తేదీల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే IMD హైదరాబాద్ తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ప్ర‌ముఖ వాతావరణ ఔత్సాహికుడు తెలంగాణ వెదర్‌మ్యాన్ కూడా.. రాబోయే 48 గంటలు అత్యంత చలిగా ఉండబోతున్నట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. రాబోయే రెండు రాత్రులు, ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్ విషయానికొస్తే డిసెంబర్ 23 మంగళవారం వరకు పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

నిన్న రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు తగ్గాయి. సంగారెడ్డి జిల్లాలో 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మారేడ్‌పల్లిలో 11.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదవడంతో హైదరాబాద్‌లోనే అత్యంత చలిగా మారింది. IMD హైదరాబాద్ జారీ చేసిన సూచన దృష్ట్యా ప్ర‌జ‌లు తమ ప్రయాణాల‌ను తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది.

Next Story