రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ వేసవి సీజన్ లో మొదటి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

By Medi Samrat  Published on  12 March 2025 8:15 PM IST
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ వేసవి సీజన్ లో మొదటి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరిక తీవ్రమైన వేసవి ప్రారంభానికి సంకేతం. మార్చి 16 వరకు కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఐఎండీ హైదరాబాద్ ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాలను వేడిగాలులు ప్రభావితం చేయనున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 39.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల వంటి ఇతర జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

Next Story