ఆదివారం నగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ వాసులు వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చనే ఆశతో ఉన్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గనున్నాయి. నిన్న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. చార్మినార్లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఐఎండీ అంచనాల్లో పేర్కొన్న విధంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.