ఏపీ-తెలంగాణకు రెయిన్ అలర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

By Medi Samrat
Published on : 18 July 2025 7:26 PM IST

ఏపీ-తెలంగాణకు రెయిన్ అలర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్‌, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మ‌రో నాలుగు రోజుల పాటు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అస‌వ‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించింది. 19న సిద్దిపేట‌, రంగారెడ్డి, హైద‌రాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో, ఈ నెల 20న రంగారెడ్డి, సంగారెడ్డి, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

Next Story