మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనో కేసీఆర్ తేల్చాలి : జ‌గ్గారెడ్డి

మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనో కేసీఆర్ తేల్చాలని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on  28 Feb 2024 1:16 PM GMT
మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనో కేసీఆర్ తేల్చాలి : జ‌గ్గారెడ్డి

మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనో కేసీఆర్ తేల్చాలని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు. మా వాళ్ళు మేడిగడ్డలోని అవినీతిని పీకడానికి వెళ్లారు. మనం కూడా పద్దతిగా మాట్లాడాలి అని మీ మేనమామకి చెప్పు హరీష్ అని సూచించారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు వంద అంటారు. మీ అమ్మని అంటే కోపం రాదా నీకు సంజయ్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పొన్నంకి సంజయ్ క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కదా..? కేటీఆర్.. హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దు అని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజల పన్నుల తో వచ్చిన డబ్బులతోనే ప్రాజెక్టులు కడతారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్.. సభలో మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారు. ఆర్థిక అంశాలు సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీఎం.. మంత్రులు మేడిగడ్డ వెళ్లి చూసి వచ్చారు. నల్గొండ సభలో.. కేసీఆర్ మేడిగడ్డనా.. బొందల గడ్డనా.. అక్కడ ఏం పీకనికి పోతున్నారు అన్నాడు కేసీఆర్.. నీ అవినీతిని పీకనికి పోయినం.. నువ్వు కట్టిన సంచులు పీకనికి పోయాం అని బ‌దులిచ్చారు. ఇప్పుడు కేటీఆర్..హరీష్ నీతులు చెప్తున్నాడు.. రేవంత్ మాటలు గురించి మాట్లాడే వీళ్లు.. కేసీఆర్ మాటలు తప్పు అని ఎందుకు చెప్పరని ప్ర‌శ్నించారు. మీ మేనమామా కు చెప్పు.. మనం కూడా ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పు అని సూచించారు. కేటీఆర్.. నువ్వు కూడా నాయనా నువ్వు అట్లా అనకు అని చెప్పు అని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ఒకటి అంటే..మేము వంద అంటాం అని అన్నారు. తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్నది మీరు.. మేడిగడ్డ బ్యారేజి నా.. బొందల గడ్డనో ముందు తేల్చండి కేసీఆర్ అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు దీనిపై క్లారిటీ ఇవ్వు అని కోరారు. కేటీఆర్.. మా సీఎం పిలిచినప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు మేడిగడ్డ.. ఎందుకు రాలేదో సమాధానం చెప్పు అని నిల‌దీశారు. అసెంబ్లీ లో చర్చ కు కూడా ఎందుకు రాలేదు మీ నాయన.. అధికార పక్షం పిలిచినప్పుడు నువ్వెందుకు రాలేదని అడిగారు. కేసీఆర్ రాకుండా మేడిగడ్డ పోయినా వృథా అన్నారు. కడియం శ్రీహరి మాటలకు విలువ లేదన్నారు. బాల్క సుమన్ చిన్న పిలగాడని అన్నారు.

పొన్నం ప్రభాకర్ మీద.. బండి సంజయ్ మాటలు సరికాదని అన్నారు. పొన్నం కి క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. శ్రీరాముడు దేవుణ్ణి.. మోడీ.. సంజయ్.. కిషన్ రెడ్డి లే మొక్కుతున్నట్టు.. దునియాలో ఎవరు మొక్కడం లేదన్న బిల్డప్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. శ్రీరాముడు ఆదర్శ మూర్తి.. రానున్న తరాలకు ఆదర్శం. ఆదర్శంగా బతకాలి అని చెప్పాడు రాముడు.. రాముడి పేరు మీద ఓట్లు అడిగి బతుకుతున్నారు బీజేపీ నేతలు అని మండిప‌డ్డారు. శ్రీరాముడు తల్లి మాటలు విని అడవికి పోయాడని.. రాముడు తల్లిని గౌరవించారు.. మరి నువ్వు పొన్నం తల్లిని ఎందుకు గౌరవించలేదు సంజయ్ అని ప్ర‌శ్నించారు. సంజయ్.. మీ అమ్మని అంటే కోపం రాదా అని ప్ర‌శ్నించారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు.

మెదక్ ఎంపీగా పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేద‌న్నారు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని స్ప‌ష్టం చేశారు. టైం బాగా లేక సంగారెడ్డిలో ఓడిపోయాన‌న్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు.. గెలిపిస్తే పని చేస్తా.. ఓడకోడితే రెస్ట్ తీసుకుంటాన‌న్నారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నాని తెలిపారు.

కడియం శ్రీహరిది గాలిపటం లాంటి జీవితం అన్నారు. ఏం అర్థం కాక మాట్లాడుతున్నాడని అన్నారు. రాజకీయంగా ఆయనకు ఉన్న బాధ ఆయనకు ఉంటుందన్నారు. టీడీపీలో పని చేసినప్పుడు చంద్రబాబు మాటే కదా విన్నది.. మా పార్టీ నాయకుడి మాట మేము వింటామ‌న్నారు.

Next Story