ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసు పంపించారు.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 3:48 PM IST

Telangana, Phone Tapping Case, Congress, Bjp, Brs, Etela Rajender

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తోన్న సిట్ అధికారులు..తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసు పంపించారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేపు ఉదయం సిట్ అధికారుల ఎదుట హాజరుకానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న శాంతి కుమారి, రఘునందన్ ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను డీఓటీకి శాంతి కుమారి పంపించారు. రివ్యూ కమిటీ ఛైర్ పర్సన్‌గా డీఓటీకి ఫోన్ నెంబర్ల లిస్టును శాంతి కుమారి పంపించారు.

ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్ల లిస్టు ఇచ్చినట్లు సిట్ అధికారులు తమ ఇంటరాగేషన్‌లో గుర్తించారు. గత సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో లిస్టును రివ్యూ కమిటీ కన్ఫామ్ చేయగా, 2023 నవంబర్‌లో 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ద్వారానే ప్రభాకర్ రావు పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. కాగా ఈ 618 ఫోన్ నెంబర్ల వ్యవహారంపైనే సిట్ అధికారులు స్టేట్‌మెంట్స్ రికార్డు చేస్తున్నారు.

Next Story