యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుంది : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Fires On CM KCR. హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీలో తిరుగుబాటు

By Medi Samrat  Published on  18 Oct 2021 4:32 PM GMT
యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుంది : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయ‌న మీడియాతో చిట్‌చాట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ లో హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదని అన్నారు. విజయ గర్జన సభ పెడ్త అని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికేనని ఆయన పేర్కొన్నారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ముందస్తు ఎన్నికలు రావాల‌ని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావని.. 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన వివరించారు. విజయ గర్జన సభలు కేసీఆర్ భయంతోనే పెడుతున్నార‌ని.. ఇవే టీఆర్ఎస్ పార్టీకి చివరి సభలు అవుతాయని అన్నారు.

హరీష్ రావును కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతార‌ని వ్యాఖ్యానించారు. ఈటెల గెలిచినా.. ఓడినా ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ తో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయి. మోదీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తు ఎన్నికలలోకి వెళ్తారని, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే అంటే టీఆర్ఎస్‌లో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్ చెప్పడం లేదని.. ప్రతి నియోజకవర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు.. కాబట్టి వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నార‌ని అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారని.. ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో ఉంటుందని చెప్పుకోవడం కోసమే.. ఈ ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నార‌ని అన్నారు.

విజయ గర్జన సభ ఎందుకు పెడ్తున్నార‌ని.. రాష్ట్రంలో ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించార‌ని విజయ ఘర్జన సభ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తాం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారు.. ఇది దేనికి సంకేతమని అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో.. దళిత, గిరిజనులకుమూడు ఎకరాల భూమి ఇస్తామ‌ని వుంది.. దళితలు, సీఎం పదవి కావాలని అడగలేదు. దళిత సీఎం అని.. ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్.. మోసం చేశార‌ని అన్నారు. దళిత బంధు కూడా అడగలేదు.. వాళ్లు అడిగింది ఏ, బీ, సీ, డీ వర్గీకరణ.. అది ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ప్రధానిని ఎన్నోసార్లు కలిశారు.. ఎప్పుడైనా ఎస్సీల ఏ, బీ, సీ, డీ వర్గీకరణ గురించి ప్రధాన మోదీని అడిగారా..? కేసీఆర్.. దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ సొంత పార్టీలోనే దళితులకు ప్రాధాన్యత లేదని పార్టీ అధ్యక్ష పదవీ కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో.. ఒక్క దళితుడు కూడా లేరని.. నిన్న వేదికపై కూడా కేసీఆర్ పక్కన దళితుణ్ని కూర్చోబెట్టుకొలేదని అన్నారు. దళిత ద్రోహి నాయకత్వంలో.. మరో దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీలో జాయిన్ అవుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుందని.. దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగిందని.. కేసీఆర్ పై కేసులు, దాడులు జరగకుండ ఒప్పందం జరిగిందని అన్నారు. గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ సర్కారును కేసీఆర్ రద్దు చేస్తార‌ని అన్నారు. సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటని రేవంత్‌ ప్రశ్నించారు. టిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని రేవంత్ అన్నారు.


Next Story