ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా రేపు (సోమవారం) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి కావడంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయాడు. అప్పటినుంచి తిరిగి ఇండియాకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కేంద్రం సహకారంతో ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గత సంవత్సరం మార్చి 10వ తేదీన కేసు నమోదు అయింది. తరువాతి రోజే ప్రభాకర్ రావు మూడు నెలల కాల పరిమితి వీసాపై అమెరికా తిరిగి వెళ్లి తిరిగి రాలేదు. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఎట్టకేలకు ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు చేయనున్నారు.మాసబ్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి సిట్ ఆఫీస్ మార్పు చెయ్యనున్నారు. రెండు నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి సిట్ పని చేసింది. అయితే రేపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.