కేసీఆర్ వాహనంలో తనిఖీలు

ప్రతిపక్ష నేతగా తొలి పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

By Medi Samrat  Published on  31 March 2024 10:46 AM GMT
కేసీఆర్ వాహనంలో తనిఖీలు

ప్రతిపక్ష నేతగా తొలి పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మే 13న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పెట్రోలింగ్‌లో భాగంగా అధికారులు కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం ఎర్రవెల్లి నుంచి జనగాం జిల్లా ధరావత్ తండా వరకూ కేసీఆర్ తన యాత్రను ప్రారంభించారు.

నాలుగు బోర్లు వేసినా నాలుగు ఎకరాల్లో పంట నష్టపోయిన అంగోతు సత్తెమ్మ అనే రైతును కలిశారు కేసీఆర్. తాను రూ.4-5 లక్షల అప్పుల్లో ఉన్నానని కేసీఆర్‌కు ఆమె చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని మన నీళ్లు తెచ్చుకునేందుకు పోరాడుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటామని బీఆర్‌ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది.

"పొలం ఎండిపోయింది.. కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు. రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు." అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

Next Story