రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?..ఇదేనా మీరు చెప్పిన మార్పు?: హరీశ్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 26 Dec 2025 12:58 PM IST

Telangana, Harishrao, Congress, urea distribution, Farmers, Cm Revanthreddy

రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?..ఇదేనా మీరు చెప్పిన మార్పు?: హరీశ్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. తన ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే. “అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా?

యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది? యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు”, సీఎం రేవంత్? గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా?..అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Next Story