అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.

By Knakam Karthik
Published on : 2 Jun 2025 1:16 PM IST

Telangana, Madhuyaskhi goud, Brs Mlc Kavitha, Congress, Brs, Bjp, Kcr

అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. కవిత బీజేపీ వదిలిన బాణం. లిక్కర్ కేసు నుండి బయటపడటానికి బీజేపీ సహకారం కవితకు కావాలి. కవిత మీద నిజామాబాద్‌లో జీఎస్టీ స్కామ్ ఉంది. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి కవిత నాటకం. జాగృతిలో రూ. 800 కోట్ల అవినీతి జరిగింది. జాగృతి మీద విచారణ జరగాలి. జాగృతి పేరు మీద వసూళ్లు చేశారు. అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకోవడానికి కవిత జాగృతి బలోపేతం అంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తానని చేయలేదు. బంజారాహిల్స్‌లో రూ. 2 వేల కోట్ల ఆస్తులు ఉన్నవి, విల్లాలు ఎక్కడివి? బ్యూటీ పార్లర్ నడిపే కవితకు వేల కోట్లు ఎక్కడివి. స్కిల్ ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం జాగృతికి ఫండ్స్ ఇస్తే కవిత కాజేసింది..అని మధుయాష్కీ ఆరోపించారు.

బీజేపీ వ్యూహ రచనలో భాగమే కవిత లెటర్. కవిత లెటర్ వెనుక బీజేపీ ఉంది. బీఆర్ఎస్ వీక అయితేనే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని మోడీ స్ట్రాటజీ. కవితను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంత ఖర్మ పట్టలేదు. ఎంపీగా ఉన్నప్పుడు మోడీతో సెల్ఫీలు దిగుతూ తిరిగింది. కాశ్మీర్‌లో యువతిపై అత్యాచారం జరిగితే మహిళగా ఆనాడూ ఒక్క మాట మాట్లాడలేదు. కవిత బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను ముంచాలని చూస్తుంది. కవిత లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వాములు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పార్టీ ఆఫీసులో కనీసం జెండా ఎగవేయలేదు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో కల్వకుంట్ల కుటుంబం పీకల్లోతుకు కూరుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కవిత బ్యూటి పార్లర్ పెట్టుకొని బ్రతికేది. Brs అంటేనే బందీ పోటు దొంగల పార్టీ..అని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వచ్చాక రాక ముందు కల్వకుంట్ల ఆస్తులు ఎన్ని? తెలంగాణను దోచుకున్న రాబందుల పార్టీని వాళ్లకు వంత పాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సొమ్ముకు శిక్ష ఒక్కటే సరిపోదు. కేటీఆర్‌కు అమెరికా, దుబాయ్‌లో పెట్టుబడులు ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడానికే కేటీఆర్ అమెరికా వెళ్లారు. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధన కాదు, ముఖ్యమంత్రి కావడమే ఆయన టార్గెట్..అని మధుయాష్కీ ఆరోపించారు.

Next Story