కమిషన్ ముందు నుంచో బెడితే పైశాచిక ఆనందం వస్తుంది కానీ..ఆయన ఖ్యాతి తగ్గదు: కేటీఆర్
ఈ క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik
కమిషన్ ముందు నుంచో బెడితే పైశాచిక ఆనందం వస్తుంది కానీ..ఆయన ఖ్యాతి తగ్గదు: కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ను కమిషన్ ముందు నిలబెడితే మీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరమే..అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరింది. 11 నెలల కాలంలో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీ చంద్రఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ
— KTR (@KTRBRS) June 11, 2025