సీఎం రేవంత్కు జాగృతి తరపున అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నాం: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
సీఎం రేవంత్కు జాగృతి తరపున అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నాం: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 20 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన సీఎం రేవంత్కు శుభాకాంక్షలు. ఆర్ఈసీ సంస్థ నుంచి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో అప్పులు కడుతున్నారని సర్టిఫికెట్ ఇచ్చారు. 2030 వరకు కిస్తీలు కడతామని కేసీఆర్ చెప్పారు. దీనిపై రేవంత్ ప్రభుత్వం 2040 వరకు రీషెడ్యూల్ చేయాలని లేఖ రాసింది. మరో వైపు ఆర్ఈసీ సంస్థకు 2024 నుంచి కిస్తీలు కట్టడం లేదని ఆ సంస్థ లేఖ రాసింది. నాన్ పే కస్టమర్గా ప్రకటిస్తామని ఆర్ఈసీ సంస్థ ఆ లేఖలో తెలిపిందని..ఎమ్మెల్సీ కవిత అన్నారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు కిస్తీలు కట్టకపోగా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదు..అని కవిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి జాగృతి తరపున అవినీతి చక్రవరి బిరుదు ఇస్తున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకుండానే కాంట్రాక్టు సంస్థలకు అడ్వాన్సులు చెల్లించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం సహా ఐదు గ్రామాలకు అన్యాయం జరుగుతుంది. 2024 జులై 6న ప్రగతి భవన్లో సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తన అనుభవంతో గోదావరి, కావేరి లింక్ పేరుతో నీళ్లు తరలిస్తున్నారు. సీఎం రేవంత్ సర్కార్ మొద్దు నిద్రతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది..అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
Live: Addressing media https://t.co/Dj1RU7egkF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 26, 2025