రాష్ట్రంలో ఆ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగాలు అన్ని ఒకే కుటుంబానికి చెందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు

By Knakam Karthik
Published on : 2 Jun 2025 10:30 AM IST

Telangana, Bjp State President Kishanreddy, Telangana Formation Day, Brs, Bjp, Congress, Kcr

రాష్ట్రంలో ఆ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగాలు అన్ని ఒకే కుటుంబానికి చెందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రపంచ చరిత్రలో లిఖించదగినది. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. జాతీయ పార్టీలలో ముందుగా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపిన పార్టీ బీజేపీ. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఒకే నినాదం ఎత్తుకుని ఉద్యమాన్ని నడిపించిన పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి అని పోరాటం చేశాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నీళ్లు పేరిట సొమ్ము చేసుకున్నారు..అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి, ఆయన కుటుంబాన్ని బంగారం కుటుంబం చేసుకున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆనాడు సోనియాగాంధీని దెయ్యం అన్నారు.. ఆయనకు ఉద్యోగం రాగానే ఇప్పుడు దేవత అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నా.. రాష్ట్రానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ శని లాగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు ఏ మాత్రం తేడా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి. ఏ ఆకాంక్షల కోసమైతే ఉద్యమాల బాటపట్టి 1200 మంది ఆత్మబలిదానం చేశారో.. వారి ఆశయాలను బీజేపీ నెరవేర్చుతుంది. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది...అని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story