16న విచారణకు రండి.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik
ఆ కేసులో ఈ నెల 16న విచారణకు రండి..కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్ రేసులో అవినీతి జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై డిసెంబర్ 29, 2024లో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్ రేస్ అంశంపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. కేటీఆర్ను ఏ1గా, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చించి. అయితే ఇప్పటికే ఒకసారి ముగ్గురిని కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసింది.
అయితే జనవరి 6వ తేదీన కేటీఆర్ తన లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్లారు. అయితే అప్పుడు కేటీఆర్ లాయర్లను అధికారులు అనుమతించలేదు. జనవరి 8వ తేదీన మళ్లీ విచారణకు హాజరైన కేటీఆర్ను ఏసీబీ 7 గంటల పాటు విచారించింది. జనవరి 9వ తేదీన కూడా విచారణకు హాజరుకావాలని పిలిచింది. అయితే కేటీఆర్ స్పందిస్తూ.. ముందస్తు విదేశీ పర్యటన షెడ్యూల్ కారణంగా తర్వాత హాజరవుతానని చెప్పారు. ఈ క్రమంలో ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.