మారిన టీమిండియా 'ట్రైనింగ్‌ కిట్'.. ఆశ్చర్యపరిచిన జడేజా..!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.

By Medi Samrat
Published on : 8 Jun 2025 8:52 AM IST

మారిన టీమిండియా ట్రైనింగ్‌ కిట్.. ఆశ్చర్యపరిచిన జడేజా..!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు టీం ఇండియా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ చేరుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు రవీంద్ర జడేజా ఓ ఫొటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

జూన్ 5న ఇంగ్లండ్‌కు బయలుదేరిన టీమ్ ఇండియా జూన్ 6న అక్కడికి చేరుకుంది. ఆ త‌ర్వాత‌ అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జూన్ 7న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక కథనాన్ని పోస్ట్ చేశాడు, అందులో అతను కొత్త ట్రైనింగ్ కిట్‌తో కనిపించాడు. ఇందులో అతను కొత్త ట్రైనింగ్ కిట్‌ను చూపిస్తూ.. పాజిటివ్ వైబ్ అనే క్యాప్షన్‌లో రాశాడు. కొత్త ట్రైనింగ్ కిట్ జెర్సీ రంగు నీలం కాగా.. చేతులపై తెల్లటి చారలు ఉన్నాయి.


టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వచ్చిన భారత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. జడేజా ఇప్పటికే ఇక్క‌డ టెస్టు క్రికెట్ ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా ఆటతీరు ఈ సిరీస్‌లో కీలకం కానుంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయిన‌ తర్వాత.. భారత జట్టు టెస్ట్ బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో ఆడబోయే బ్యాటింగ్ ఆర్డర్‌పైనే అందరి చూపు పడింది. కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లు జట్టులోకి వచ్చారు. రిషబ్ పంత్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అదనపు వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. జురెల్ అనధికారిక మ్యాచ్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు సాధించాడు.

జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహించనున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాష్‌ దీప్‌లు కూడా జట్టులోకి వచ్చారు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులో చోటు దక్కించుకోవడంలో సఫలమయ్యారు. ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ గెలిచిన ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు.

Next Story