ప్రధాని మోదీని కలుసుకున్న యువ సంచలనం..!
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శుక్రవారం (30 మే 2025) పాట్నా విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శుక్రవారం (30 మే 2025) పాట్నా విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. యువ క్రికెటర్ సూర్యవంశీ ప్రధాని మోదీ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. యువ వైభవ్కు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు. పాట్నా విమానాశ్రయంలో వైభవ్ సూర్యవంశీని కలిసిన సమాచారాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పంచుకున్నారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, 'యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, అతని కుటుంబాన్ని పాట్నా విమానాశ్రయంలో కలిశారు. అతడి క్రికెట్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
PM Narendra Modi tweets, "At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours" pic.twitter.com/aphFpVyzzt
— ANI (@ANI) May 30, 2025
వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో చాలా త్వరగా ప్రసిద్ధి చెందాడు. బీహార్లోని సమస్తిపూర్ నివాసి అయిన వైభవ్ కేవలం 14 సంవత్సరాల వయస్సులో IPL అరంగేట్రం చేసాడు. రాజస్థాన్ రాయల్స్ అతనిపై విశ్వాసం వ్యక్తం చేసింది. అతనికి IPL 2025లో ఏడు మ్యాచ్లు ఆడే అవకాశాన్ని కూడా ఇచ్చింది. వైభవ్ 7 మ్యాచ్లలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సహాయంతో 252 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడంతో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్లో అతడు 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ 28 ఏప్రిల్ 2025న జైపూర్లో జరిగింది.