రాజాసింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్!

గోషామహల్ నియోజకవర్గం స్థానాన్ని సునాయాసంగా గెలుచుకున్న తరువాత, వివాదాస్పద నాయకుడు టి రాజా సింగ్ లోక్‌సభ స్థానంపై కన్నేశారు.

By అంజి  Published on  22 Jan 2024 1:45 AM GMT
BJP, Raja Singh, Lok Sabha elections, Hyderabad

రాజాసింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్!

హైదరాబాద్: బిజెపి పార్టీ నుండి సస్పెన్షన్‌ను విజయవంతంగా రద్దు చేయడంతో, గోషామహల్ నియోజకవర్గం స్థానాన్ని సునాయాసంగా గెలుచుకున్న తరువాత, వివాదాస్పద నాయకుడు టి రాజా సింగ్ లోక్‌సభ స్థానంపై కన్నేశారు. నివేదికల ప్రకారం.. మూడుసార్లు బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. తనపై నమోదైన అనేక కేసులతో 'ద్వేషపూరిత ప్రసంగాలకు' అపఖ్యాతి పాలైన బిజెపి నాయకుడు, ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ స్థానంలో అసభ్యకర ప్రసంగాలు చేశాడు. ప్రస్తుతం ఔరంగాబాద్‌ ఎంపీగా ఏఐఎంఐఎం నేత సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు.

రాజా సింగ్, ఔరంగాబాద్ నుండి పోటీ చేయాలనే ఉద్దేశ్యాన్ని ఇటీవల పార్టీ అధిష్ఠానికి తెలియజేసినట్టు సమాచారం. అయితే ఆయనను హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఏఐఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోతానేమోనన్న భయంతో హైదరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేరని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజా సింగ్ ఇటీవల మహారాష్ట్రకు తరచుగా వెళ్తున్నారు. ముఖ్యంగా ఔరంగన్‌బాద్. అక్కడ పలు సమావేశాల్లో ప్రసంగిస్తూ స్థానిక నేతలకు మరింత దగ్గరయ్యారు. ఔరంగాబాద్‌లో బీజేపీకి మంచి విజయావకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2019 ఎన్నికల్లో బీజేపీ-శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే 4,492 ఓట్ల స్వల్ప తేడాతో ఇంతియాజ్ జలీల్ చేతిలో ఓడిపోయారు. ఇంతియాజ్ జలీల్‌కు 3,89,042 ఓట్లు రాగా, చంద్రకాంత్‌కు 3,84,550 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్‌కు 2,83,798 ఓట్లు రాగా, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థికి 91,790 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజా సింగ్ పార్టీ ముందు ఉంచిన మరొక ఎంపిక ఏమిటంటే, అతనికి గణనీయమైన అనుచరులు ఉన్న చేవెళ్ల లేదా జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుండి అతన్ని పోటీకి దింపడం.

Next Story