నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదుల హతం

Two terrorists killed in encounter in Kashmir's Machil along LoC. కాశ్మీర్‌లోని మచిల్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు

By Medi Samrat  Published on  25 Sep 2022 12:15 PM GMT
నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదుల హతం

కాశ్మీర్‌లోని మచిల్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్‌లోని టేక్రి నార్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని, ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

"Army and Kupwara Police neutralised two #terrorists near LoC Tekri Nar in Machil area of Kupwara. Identification of the killed terrorists being ascertained. 02 AK 47 rifles, 02 pistols & 04 hand grenades recovered. Further details shall follow." అంటూ కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

10 రోజుల క్రితం కశ్మీర్ పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందడంతో.. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.


Next Story