దొంగతనాలు చేయడానికి ఏకంగా విమానాల్లో వచ్చిన గ్యాంగ్..!

Thieves Who Arrived by Flights to Rob Homes In Bengaluru Arrested. బెంగళూరు నగరంలోని దొంగతనాలు చేయడానికి విమానంలో నగరానికి వచ్చిన ముగ్గురు

By Medi Samrat  Published on  19 March 2022 3:00 PM GMT
దొంగతనాలు చేయడానికి ఏకంగా విమానాల్లో వచ్చిన గ్యాంగ్..!

బెంగళూరు నగరంలోని దొంగతనాలు చేయడానికి విమానంలో నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురిని హరిదాస్ బరాయ్ (37), పర్హల్దార్ అలియాస్ రాకేష్ (32), రతన్ సాహా (52)గా గుర్తించి దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. వారి నుంచి రూ.38 లక్షల విలువైన 745 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు దొంగతనాలను ప్రత్యేకమైన ప్రణాళికతో చేసే వారు. ఇళ్లలో చోరీ చేయాలనే ఉద్దేశంతో ముగ్గురు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు విమానాల్లో వచ్చారు. నగరంలో మోటార్‌ బైక్‌లను దొంగిలించే వారు. తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ నిర్వహిస్తారు. వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లను వేస్తున్నట్లు నటించేవారు.

2-3 ఇళ్లను ఎంచుకుని, యజమానులు ఇంట్లో లేరని నిర్ధారించుకున్న తర్వాత వాటిలోకి చొరబడే వారు. దోపిడీ చేసిన బంగారాన్ని బెంగళూరులోని స్థానిక నగల దుకాణాల్లో విక్రయించారు. నగదు సేకరించిన తర్వాత ముగ్గురు నిందితులు రైళ్లలో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఇటీవల బాణసవాడిలో జరిగిన దోపిడీ తర్వాత నిందితుల ఆచూకీ లభించింది. గతంలో ఢిల్లీ, సికింద్రాబాద్‌లలో దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లిన హరిదాస్ కు సంబంధించిన వివరాలు సీసీటీవీ ఫుటేజీలో లభించాయి. సాక్ష్యాధారాల ఆధారంగా బెంగుళూరు పోలీసులు ఈ ముగ్గురిని పశ్చిమ బెంగాల్‌లోని రహస్య ప్రదేశం నుండి అరెస్టు చేశారు.










Next Story