జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

By Knakam Karthik
Published on : 15 May 2025 8:27 AM IST

National News, Jammukashmir, Encounter, Security Forces,  Terrorists

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతం నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాగా 48 గంటల్లో కేంద్ర పాలిత ప్రాంతంలో రెండో ఎన్‌ కౌంటర్. జైషే మహమ్మద్‌కు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

కాగా, మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని షుక్రూ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబా (LeT)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల వివరాలను అధికారులు గుర్తించారు. ఒకరు షోపియన్ జిల్లా హీర్పోరా గ్రామానికి చెందిన షాహిద్ కుట్టే కాగా.. మరొకరు వాండూనా మెల్హోరా గ్రామానికి చెందిన అద్నాన్ షఫీ దార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, ఒక డ్రైవర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

2023 లో లష్కరేలో చేరిన కుట్టాయ్, గత ఏడాది ఏప్రిల్ 8 న డానిష్ రిసార్ట్‌లో జరిగిన కాల్పుల సంఘటనలో పాల్గొన్నాడు, ఇందులో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. గత ఏడాది మేలో షోపియన్‌లోని హీర్పోరాలో బిజెపి సర్పంచ్ హత్యలో కూడా అతనికి సంబంధం ఉందని వర్గాలు తెలిపాయి. 2024లో ఉగ్రవాద సంస్థలో చేరిన షఫీ, షోపియన్‌లోని వాచిలో స్థానికేతర కార్మికుడిని హత్య చేయడంలో పాల్గొన్నాడని వర్గాలు తెలిపాయి. షోపియన్‌లో మరణించిన ఉగ్రవాదుల నుండి మూడు ఎకె-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story