Alert : విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

పెరిగిన విమాన తనిఖీలు, చెడు వాతావరణం, గగనతల పరిమితుల కారణంగా ఎయిర్ ఇండియా శుక్రవారం ప‌లు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది.

By Medi Samrat
Published on : 20 Jun 2025 11:48 AM IST

Alert : విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

పెరిగిన విమాన తనిఖీలు, చెడు వాతావరణం, గగనతల పరిమితుల కారణంగా ఎయిర్ ఇండియా శుక్రవారం ప‌లు అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. ప్రభావిత విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్‌బోర్న్, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై మధ్య న‌డిచే విమానాలు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం.. ఎయిర్ ఇండియా దుబాయ్ నుండి చెన్నైకి న‌డిచే AI906; ఢిల్లీ నుండి మెల్బోర్న్‌కు న‌డిచే AI308; మెల్బోర్న్ నుండి ఢిల్లీకి న‌డిచే AI309; దుబాయ్ నుండి హైదరాబాద్‌కు న‌డిచే AI2204, పూణే నుండి ఢిల్లీకి న‌డిచే AI874, అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి న‌డిచే AI456 విమానాలతోపాటు.. నిర్వహణ, కార్యాచరణ కారణాల వల్ల హైదరాబాద్ నుండి ముంబైకి AI-2872, చెన్నై నుండి ముంబైకి AI571 రద్దు చేయబడ్డాయి.

ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. వారి సౌలభ్యం కోసం అనేక చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గిస్తుందని.. జూన్ 21 నుండి జూలై 15, 2025 వరకు మూడు మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు.. ప్రయాణీకులకు పూర్తి వాపసు లేదా ఉచిత రీషెడ్యూల్ సౌకర్యం ఇవ్వబడుతుంది.

ఎయిర్ ఇండియా తన ప్రకటనలో.. "ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మా గ్రౌండ్ స్టాఫ్ సహచరులు ప్రయాణీకులు వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌యాణం రద్దు అయిన‌ ప్రయాణీకులకు పూర్తి వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అందించబడుతుంది. తమ విమాన స్థితిని వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలని లేదా కస్టమర్ కేర్ నంబర్‌లను సంప్రదించాలని విమానయాన సంస్థ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

Next Story