గణతంత్ర వేడుకలపై భారీ ఉగ్రముప్పు.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా.!

Security alert indicates terror plot, threat to PM Narendra Modi on Republic Day. గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర

By అంజి  Published on  18 Jan 2022 7:01 AM GMT
గణతంత్ర వేడుకలపై భారీ ఉగ్రముప్పు.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా.!

గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి నిఘా ఏజెన్సీలకు హెచ్చరిక అందింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఈ మేరకు జాతీయ దినపత్రికలు కథనాలు వెల్లడించాయి. రద్దీ ప్రదేశాలు, కీలక కట్టడాలు, ప్రజల సమూహాలు లక్ష్యంగా కూడా ఉగ్రదాడులు జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌కు వచ్చిన రిపోర్ట్‌లో తెలిసింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని నిఘా వర్గాలు సూచించాయి. ఐదు మధ్య ఆసియా దేశాలు - కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ - నాయకులను ముఖ్య అతిథులుగా ఈ గణతంత్ర వేడుకలకు ఆహ్వానించే అవకాశం ఉంది.

పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నోట్ పేర్కొంది. ఈ సమూహాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు మరియు రద్దీగా ఉండే ప్రదేశాలను విధ్వంసం/అంతరాయం కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలుస్తోంది. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు, క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని తెలిపింది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

Next Story