భారత రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలి..అని ఆర్ఎస్ఎస్ నేత హోసబాలే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమర్జెన్సీని 'సంవిధాన్ హత్యా దివస్'గా పాటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 1977 మార్చి 21 వరకు కొనసాగిన 21 నెలల కాలంలో పౌర స్వేచ్ఛలు నిలిపివేయబడ్డాయి. ప్రతిపక్ష నాయకులు, పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన అణచివేత జరిగింది...అని హోసబాలే వ్యాఖ్యానించారు.
అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, "అలాంటి పనులు చేసిన వారు నేడు రాజ్యాంగ కాపీతో తిరుగుతున్నారు. వారు ఇంకా క్షమాపణ చెప్పలేదు. మీ పూర్వీకులు అలా చేశారు. మీరు దేశానికి దీనికి క్షమాపణ చెప్పాలి" అని ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ నేత హోసబాలే అన్నారు. బీజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం జూన్ 25న అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ' సంవిధాన్ హత్య దివస్'గా పాటించిన తర్వాత హోసబెలె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పీఠికను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైందని, భారత రాజ్యాంగ విలువలపై విస్తృత చర్చ అవసరమని వ్యాఖ్యానించారు.