ఎన్‌ఆర్ఐ అని చెప్పుకుంటూ.. విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్ గా..

Pankaj used to meet women by calling himself NRI. విడాకులు తీసుకున్న మహిళలకు మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా దగ్గరై.. ఆ తర్వాత వారిని మోసం

By Medi Samrat  Published on  1 Jan 2022 8:52 AM GMT
ఎన్‌ఆర్ఐ అని చెప్పుకుంటూ.. విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్ గా..

విడాకులు తీసుకున్న మహిళలకు మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా దగ్గరై.. ఆ తర్వాత వారిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మహిళలను మాయలో పడేసే సూత్రధారి పంకజ్ తాను ఒక ఎన్.ఆర్.ఐ. అని చెప్పుకొనే వాడు. అతడి మాటలను నమ్మిన మహిళలకు వీసా పేరుతో లక్షల్లో మోసం చేసేవాడు. నిందితుడైన పంకజ్‌ 50 మంది మహిళలను మోసం చేసినట్టు విచారణలో తేలింది. మహిళల ఫిర్యాదు మేరకు పురుషోత్తం శర్మ అలియాస్ పంకజ్ శర్మ, కుల్దీప్ సింగ్ అలియాస్ బాబీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పురుషోత్తం శర్మ అలియాస్ పంకజ్ ఎన్నారైగా నటిస్తూ మహిళలను కలిసేవాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌కు చెందిన ఓ మహిళ డిసెంబర్ 2న ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె విడాకులు తీసుకున్నట్లు పేర్కొంది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఆమెకు పంకజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది, పంకజ్ పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాట ఇప్పించాడు. వీసాలు ఇప్పించే పని కూడా తాను చేస్తానని, చాలా మందిని విదేశాలకు తీసుకెళ్లానని పంకజ్ చెప్పాడు. కుటుంబ కారణాల వల్ల తాను ఆ మహిళను పెళ్లి చేసుకోలేనని, అయితే కెనడాలో ఉన్న మహిళకు మంచి సంబంధం కోసం చూస్తానని పంకజ్ ఆ మహిళతో చెప్పాడు.

విదేశాలకు పంపి వీసా ఇప్పిస్తానన్న పేరుతో పంకజ్ మహిళ నుంచి 22 లక్షల రూపాయలు మోసం చేసి తర్వాత పట్టించుకోకుండా ఉండడాన్ని ప్రారంభించాడు. దీంతో పంకజ్ తన సహోద్యోగి కుల్దీప్ ద్వారా నకిలీ వీసా తయారు చేసి ఆ మహిళకు అప్పగించాడు. అయితే అసలు విషయం తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా దర్యాప్తు ప్రారంభించి, పంకజ్ లొకేషన్ ట్రేస్ చేసి అమృత్‌సర్‌కు చేరుకుని అక్కడ పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అతడి చేతిలో చాలా మంది మహిళలు మోసపోయినట్లు తెలుస్తోంది.


Next Story