భారత్‌కు డైరెక్ట్‌గా కాల్ చేసిన పాకిస్థాన్

కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది.

By Medi Samrat
Published on : 10 May 2025 6:35 PM IST

భారత్‌కు డైరెక్ట్‌గా కాల్ చేసిన పాకిస్థాన్

కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది. కాల్పుల విరమణ గురించి రెండు దేశాల మధ్య నేరుగా చర్చలు జరిగాయని భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. రోజుల తరబడి సైనిక చర్య, ఉద్రిక్తత పెరిగిన తర్వాత కాల్పుల విరమణను భారత్ ధృవీకరించింది.

"పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు (3.30 pm) భారత DGMOకి ఫోన్ చేశారు. ఇరుపక్షాలు భూమిపై, గాలిలో సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుండి నిలిపివేయాలని అంగీకరించాయి" అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు.

Next Story