అసదుద్దీన్‌ ఓవైసీ వాహనంపై కాల్పులు.. తప్పిన ప్రమాదం

Owaisi says shots fired at his vehicle near Chhajarsi toll. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

By అంజి  Published on  3 Feb 2022 1:13 PM GMT
అసదుద్దీన్‌ ఓవైసీ వాహనంపై కాల్పులు.. తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఢిల్లీకి వెళుతుండగా తన వాహనంపై మూడు నుంచి నాలుగు రౌండ్ల బుల్లెట్లు దూసుకెళ్లాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమం ముగించుకుని ఢిల్లీకి వెళుతుండగా ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై బుల్లెట్లు దూసుకెళ్లాయి. మొత్తం ముగ్గురు ఉన్నారని, వారిలో ఇద్దరు బుల్లెట్లు పేల్చారని ఒవైసీ అన్నారు. తన వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయని ఒవైసీ తెలిపారు. ఘటన అనంతరం ఆయన మరో వాహనంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story