ప్రజాస్వామ్యం కాదు.. రాజవంశమే ప్రమాదంలో ఉంది : అమిత్ షా

Not Democracy, It Is Dynasty That Is In Danger Amit Shah On Rahul Gandhi. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  7 April 2023 12:14 PM GMT
ప్రజాస్వామ్యం కాదు.. రాజవంశమే ప్రమాదంలో ఉంది : అమిత్ షా

Minister of Home Affairs Amit Shah



గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అంటున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు.. మీ కుటుంబం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కౌశాంబిలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ అనర్హత వేటుపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను దేశ ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌న్నారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో లేదు.. కుల‌త‌త్వం, వంశపారంపర్య రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

అమిత్ షా మాట్లాడుతూ.. 'పార్లమెంట్ నిన్నటితో ముగిసింది. దేశ బడ్జెట్ సమావేశాలపై చర్చించకుండానే పార్లమెంట్‌ను ముగించడం స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. విపక్ష నేతలు సభను నిర్వహించేందుకు స‌హ‌క‌రించలేదు. రాహుల్ గాంధీ ఎందుకు అనర్హుడని.. శిక్షను సవాలు చేయాలి. మీరు పార్లమెంటు సమయాన్ని వృధా చేశారు. లోక్‌సభలో రాహుల్‌గాంధీ అనర్హత వేటుపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను దేశం ఎప్పటికీ క్షమించదని అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Next Story