కుంభాభిషేకం నిర్వహించిన ముస్లింలు

Muslims Participates In Hindu Temple Kumbabishekam Tiruvarur. దేశంలో మతానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  10 Jun 2022 11:13 AM GMT
కుంభాభిషేకం నిర్వహించిన ముస్లింలు

దేశంలో మతానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే తమిళనాడు రాష్ట్రంలో ముస్లింలు కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత గురువారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఆ మేరకు పండుతక్కడి గ్రామస్తులు, అక్కరై పుదువీది వాసులు, ముస్లింలు, భక్తులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల మండపంలో ప్రత్యేక వేదికపై పవిత్ర నదీజలాలున్న కలశాలను ప్రత్యేక వేదికపై ఉంచి విఘ్నేశ్వర పూజ సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం యాగపూజ గోపూజ, సరస్వతిపూజతో పూర్ణాహుతి జరిపారు. ఆ తర్వాత ఉదయం 10.15 గంటలకు తిరువాడుదురై కీర్తివాసన్‌ గురుక్కల్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కే బాలకృష్ణన్‌, మరో పదిమంది వేదపండితులు యాగశాలలోని పవిత్రజలాలున్న కలశాలలను గ్రామస్తులు, ముస్లిం మతపెద్దల సమక్షంలో ఊరేగింపుగా ఆలయ రాజగోపురాలపైకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత గోపురకలశాలను పవిత్ర జలాలతో అభిషేకించారు.




Next Story