మధ్యాహ్న భోజనంలో బల్లి.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

Mid day meals, 80 students fall sick in Karnataka school. కర్ణాటకలోని హవేరి జిల్లాలో కనీసం 80 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనంలో

By అంజి  Published on  28 Dec 2021 8:05 AM GMT
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్ణాటకలోని హవేరి జిల్లాలో కనీసం 80 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనంలో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపుర తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వడ్డించిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి లభ్యమైంది. 80 మందికి పైగా పాఠశాల విద్యార్థులు సాంబార్ తిన్న తర్వాత సోమవారం అస్వస్థతకు గురయ్యారు. అందులో చనిపోయిన బల్లి కనిపించింది. 80 మంది చిన్నారులను రాణిబెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చిన్నారులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పాఠశాల అధికారులు తెలిపారు.

విద్యా శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరు పిల్లల పరిస్థితి "క్లిష్టంగా" ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఓ కుర్రాడికి చనిపోయిన బల్లితో సాంబార్ వచ్చింది. బాలుడు ఇతరులను అప్రమత్తం చేసి వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. వెంటనే, ఇతర విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. పాఠశాల అధికారుల నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది.పాఠశాల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. గతంలో తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పురుగులతో కూడిన కుళ్లిన గుడ్లు బయటపడ్డాయి. బాలబడి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లను పంపిణీ చేశారు.

Next Story