తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Manish Sisodia sent to 14-day judicial custody. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

By Medi Samrat  Published on  6 March 2023 10:27 AM GMT
తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Manish Sisodia


ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ తీర్పు కారణంగా సిసోడియా ఈ నెల 20 వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరోజు దాదాపు 8 గంటల సేపు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఈరోజు మరోసారి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరకుండా, జ్యుడీషియల్ రిమాండ్ కోరారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ను విధించడంతో సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు.

సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీలు జరిగాయి కాబట్టి.. తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని బెయిల్ పిటిషన్‌ కు సంబంధించి సిసోడియా వ్యాఖ్యలు చేశారు. 2021-22కి సంబంధించి రద్దు చేసిన మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని సిసోడియాను అరెస్టు చేశారు.


Next Story