టాయిలెట్‌లు శుభ్రం చేసిన ఎంపీ.. వీడియో వైర‌ల్‌

Madhya Pradesh BJP MP Cleans School Toilet With Bare Hands. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రాష్ట్రంలోని బాలికల పాఠశాలలో

By Medi Samrat  Published on  23 Sep 2022 1:15 PM GMT
టాయిలెట్‌లు శుభ్రం చేసిన ఎంపీ.. వీడియో వైర‌ల్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రాష్ట్రంలోని బాలికల పాఠశాలలో టాయిలెట్‌ను తన చేతులతో శుభ్రం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నడుస్తున్న "సేవా పఖ్వాడా" కార్యక్రమం కింద బాలికల పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేశామని బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. పాఠశాల ఆవరణలో చెట్ల పెంపకం కార్యక్రమం అనంతరం ఆయన ఈ పనికి పాల్పడ్డారు.

నివేదికల ప్రకారం, బీజేపీ యువజన విభాగం సెప్టెంబరు 17, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు నుండి మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2 వరకు క్లీనెస్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, మిశ్రా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలను సందర్శించారు. తన పర్యటనలో, రేవా నియోజకవర్గానికి చెందిన ఎంపీ బాలికల పాఠశాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రతను గమనించి, దానిని తన చేతులతో, స్వయంగా శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని మహాత్మా గాంధీ, ప్రధాని మోడీ చెప్పారని మిశ్రా అన్నారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో తాను పాల్గొనడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్ కింద, భారతదేశంలోని అన్ని గ్రామాలు, పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు "బహిరంగ మలవిసర్జన రహితం"గా ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, ప్రభుత్వ డేటా ప్రకారం, గ్రామీణ భారతదేశంలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.


Next Story