కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. 20వ విడతకు సంబధించిన నిధులను జూన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంటే ఈ నెలలో రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి వచ్చింది. దీని ద్వారా రైతులకు సాయంగా ఎకరానికి సంవత్సరానికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. వాటిని నేరుగా రైతుల ఖాతాల్లో మూడు దఫాలుగా జమ చేస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో రూ.2 వేల చొప్పున వేస్తోంది.
జూన్లో విడుదలయ్యే కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించాలి. భూమి రికార్డుల వివరాలను ధృవీకరించాలి.