పీఎం కిసాన్‌పై కీలక అప్‌డేట్..ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది.

By Knakam Karthik
Published on : 6 Jun 2025 9:41 AM IST

National News, PM Kisan Funds, Farmers, Union Government, PM Modi

పీఎం కిసాన్‌పై కీలక అప్‌డేట్..ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది. 20వ విడతకు సంబధించిన నిధులను జూన్​లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంటే ఈ నెలలో రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి.

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి వచ్చింది. దీని ద్వారా రైతులకు సాయంగా ఎకరానికి సంవత్సరానికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. వాటిని నేరుగా రైతుల ఖాతాల్లో మూడు దఫాలుగా జమ చేస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో రూ.2 వేల చొప్పున వేస్తోంది.

జూన్‌లో విడుదలయ్యే కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. బ్యాంక్​ అకౌంట్‌​ను ఆధార్‌​తో అనుసంధానించాలి. భూమి రికార్డుల వివరాలను ధృవీకరించాలి.

Next Story