సమాజ్ వాదీ పార్టీలో చేరిన.. భారతదేశపు అత్యంత ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్

India's 'Tallest Man', Dharmendra Pratap Singh, Joins Samajwadi Party. భారతదేశపు అత్యంత ఎత్తైన వ్యక్తిగా చెప్పుకునే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ శనివారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన మిస్టర్ సింగ్

By అంజి  Published on  23 Jan 2022 9:22 AM GMT
సమాజ్ వాదీ పార్టీలో చేరిన.. భారతదేశపు అత్యంత ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్

భారతదేశపు అత్యంత ఎత్తైన వ్యక్తిగా చెప్పుకునే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ శనివారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సింగ్ 2.4 మీ (8 అడుగుల 1 అంగుళం) ఎత్తు. అతను ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాడు. సమాజ్‌వాదీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ సింగ్ పార్టీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేస్తుందని అన్నారు. "సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్‌ను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు." అని సమాజ్‌వాదీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తన ఎత్తు కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతను బయటికి వెళ్లినప్పుడు కూడా చాలా దృష్టిని ఆకర్షించేవాడు. ఒక ఇంటర్వ్యూలో మిస్టర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలు తనతో ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు, తాను ఒక సెలబ్రిటీలా భావిస్తానని చెప్పాడు. '' నేను చాలా ప్రజాదరణ పొందాను. ఇదంతా నా ఎత్తు కారణంగా ఉంది" అని అతను చెప్పాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.తన కుటుంబానికి చెందిన మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేస్తానని అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గంలోని ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Next Story