ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం

Fire Breaks Out At Chennai's Rajiv Gandhi Govt Hospital. తమిళనాడు రాజ‌ధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం

By Medi Samrat  Published on  27 April 2022 8:37 AM GMT
ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం

తమిళనాడు రాజ‌ధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలోని టవర్ 2 వద్ద ఉన్న నిల్వ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని ఒక టవర్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గుర‌య్యారు. ఓ బ్లాక్‌లోని వేర్ హౌస్‌లో నిల్వ ఉంచిన కొన్ని వస్తువుల వల్ల మంటలు చెలరేగాయని ప్రాథ‌మిక‌ విచారణలో తేలింది.

ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంట‌నే మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, M. సుబ్రమణ్యం, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్ర‌మాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Next Story